
శృంగవరపుకోట మండలం చామలాపల్లిలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమచారం ప్రకారం.. గ్రామానికి చెందిన తోత్తడి ప్రసాద్ అనే వ్యక్తిపై నడుపూరి మురళి కత్తితో దాడి చేయడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ప్రసాద్ తల తెగిందని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.